బొమ్మకు పోస్ట్మార్టం…ఎందుకో తెలుసా..?
పొరబడటం కామన్..మరీ ఈ రేంజ్ లోనా..సిట్యువేషన్ డిమాండ్ చేస్తే..తప్పదు మరి. మహరాష్ట్రలో బుల్డానాలో ఓ క్రేజీ ఇన్సిడెంట్ వెలుగు చూసింది. ఇటీవల ఓ గుర్తుతెలియని శిశువు మృతదేహాన్ని స్టేషన్కు తీసుకొచ్చారు పోలీసులు.
పొరబడటం కామన్..మరీ ఈ రేంజ్ లోనా..సిట్యువేషన్ డిమాండ్ చేస్తే..తప్పదు మరి. మహరాష్ట్రలో బుల్డానాలో ఓ క్రేజీ ఇన్సిడెంట్ వెలుగు చూసింది. ఇటీవల ఓ గుర్తుతెలియని శిశువు మృతదేహాన్ని స్టేషన్కు తీసుకొచ్చారు పోలీసులు. పోస్టుమార్టం అనంతరం రిపోర్టు చూసి నిర్ఘాంతపోయారు పోలీసులు. ఎందుకంటే అది మృతదేహం కాదు జస్ట్ ఆడుకునే బొమ్మ మాత్రమే.
వివరాల్లోకి వెళ్తే.. బుల్డానా జిల్లా ఖామ్గావ్ తాలూకా బోర్జావాల్ గ్రామంలో గురువారం ఓ శిశువు మృతదేహం నదిలో తేలియాడుతూ కనిపించింది. అది చూసిన గ్రామస్థుల స్థానిక పోలీసులకు విషయాన్ని చేరవేశారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు. అక్కడ అసలు మిస్టరీ వీడింది. అది శిశువు శవం కాదు, అచ్చం చిన్నారిలా కనిపించే ఓ ఆట బొమ్మ మాత్రమే.