బాబుకు ‘హృదయ కాలేయం’గా మారాడు: సుజనాపై విజయసాయిరెడ్డి సెటైర్లు
బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి సుజనాచౌదరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ‘‘బ్యాంకులకు 6వేల కోట్లు ఎగ్గొట్టి ఈడీకి అడ్డంగా దొరికిన తరువాత కూడా సుజనా చౌదరి ఇలానే దబాయించాడు. ఆ కంపెనీలతో తనకేం సంబంధం లేదంటూ బుకాయించాడు. అమరావతిలో సెంటు భూమి కూడా లేదని బుకాయిస్తున్నాడు. ఫ్రాడ్లలో ఆరితేరిపోయి చంద్రబాబుకు హృదయకాలేయంగా మారాడు’’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. బ్యాంకులకు 6 వేల కోట్లు ఎగ్గొట్టి ఈడీకి అడ్డంగా […]
బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి సుజనాచౌదరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ‘‘బ్యాంకులకు 6వేల కోట్లు ఎగ్గొట్టి ఈడీకి అడ్డంగా దొరికిన తరువాత కూడా సుజనా చౌదరి ఇలానే దబాయించాడు. ఆ కంపెనీలతో తనకేం సంబంధం లేదంటూ బుకాయించాడు. అమరావతిలో సెంటు భూమి కూడా లేదని బుకాయిస్తున్నాడు. ఫ్రాడ్లలో ఆరితేరిపోయి చంద్రబాబుకు హృదయకాలేయంగా మారాడు’’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
బ్యాంకులకు 6 వేల కోట్లు ఎగ్గొట్టి ఈడీకి అడ్డంగా దొరికిన తర్వాత కూడా @yschowdary ఇలాగే దబాయించాడు. ఆ కంపెనీలతో తనకేం సంబంధం అని బుకాయించాడు. అమరావతిలో సెంటు భూమి లేదని బుకాయిస్తున్నాడు. ఫ్రాడ్లలో ఆరితేరిపోయి @ncbn కు హృదయ కాలేయంగా మారాడు. @BJP4India @JaiTDP
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 29, 2019
కాగా రాజధాని అమరావతిలో బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి వందల ఎకరాల భూములున్నాయని మంత్రి బొత్స ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలపై స్పందించిన సుజనా.. అమరావతి పరిధిలో తనకు గజం భూమి లేదని అన్నారు. రాజధాని అంశాన్ని డైవర్ట్ చేసేందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని సుజనా పేర్కొన్న విషయం తెలిసిందే.