Janasena: పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..

జనసేనాని పవన్ కళ్యాణ్‌‎కు మద్దతుగా నిలిచారు హీరో వరుణ్ తేజ్. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్ననున్నట్లు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఏపీలో ఎన్నికల వేడి వేసవి ఉష్టోగ్రతల కంటే కూడా రెండు డిగ్రీలు ఎక్కువగా ఉంటోంది. ఒకవైపు అధికార వైసీపీ, మరోవైపు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. ఈ తరుణంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయనున్నారు.

Janasena: పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
Varun Tej
Follow us

|

Updated on: Apr 26, 2024 | 6:06 PM

జనసేనాని పవన్ కళ్యాణ్‌‎కు మద్దతుగా నిలిచారు హీరో వరుణ్ తేజ్. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్ననున్నట్లు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఏపీలో ఎన్నికల వేడి వేసవి ఉష్టోగ్రతల కంటే కూడా రెండు డిగ్రీలు ఎక్కువగా ఉంటోంది. ఒకవైపు అధికార వైసీపీ, మరోవైపు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. ఈ తరుణంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయనున్నారు. అక్కడ ఇప్పటికే ప్రచారాన్ని కూడా నిర్వహించారు. తానను గెలిపిస్తే పిఠాపురం నియోజకవర్గానికి ఏం చేస్తానో వివరించారు. ఆ తరువాత పలు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో తాను పోటీ చేసే నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నాగబాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పవన్ గెలుపుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు ఆయన.

ఈ క్రమంలోనే పిఠాపురంలో పవన్ గెలుపుకు దోహదపడేలా ప్రచారంలో సినిమా రంగులు అద్దుతున్నారు. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ రాజకీయ ప్రచారంలో పాల్గొనేందుకు పార్టీ వర్గాలు సర్వం సిద్దం చేశాయి. శనివారం పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇది ఇతనికి తొలి రాజకీయ ప్రసంగం కానుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్దమైన వరుణ్ తేజ్ ఏలా మాట్లాడుతారు, ఏం చెబుతారన్న ఉత్కంఠ అటు రాజకీయ వర్గాల్లో, సినీ అభిమానుల్లో నెలకొంది. ఈ ప్రచారం గొల్లప్రోలు రూరల్ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రచారం మొదలు కానుంది. వన్నెపూడి మీదుగా కొడవలి, చందుర్తి మీదుగా దుర్గాడ చేరుకుంటారన్నారు. ఎన్నికల ప్రచార ర్యాలీ, రోడ్ షో, సమావేశాల్లో వరుణ్ తేజ్ ప్రసంగిస్తారని తెలిపారు. ఈ ప్రచారంలో వరుణ్ తేజ్ తో కలిసి పవన్ పాల్గొంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే నాగబాబు, జానీ మాస్టర్, హైపర్ ఆది, పృథ్వీ, గెటప్ శ్రీను తదితరులు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…