అందుకే కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్‌లోకి వెళుతున్నారు: విజయశాంతి

|

Apr 03, 2019 | 9:07 AM

హైదరాబాద్: కొంతమంది కాంగ్రెస్ నాయకులు డబ్బులకు ఆశపడే టీఆర్ఎస్‌లోకి వెళుతున్నారని కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శించారు. కేసీఆర్ ఒక అబద్ధాల కోరు, కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలియదా? సోనియా గాంధీ లేకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారా? అంటూ ఆమె ఫైరయ్యారు. అసలైన తెలంగాణ ఇంకా రాలేదు, రానున్న రోజుల్లో కేసీఆర్‌కి ఓటు ఎందుకు వేశామా? అని అనుకోవాల్సిన పరిస్థితి వద్దు అంటూ విజయశాంతి మాట్లాడారు. కేసీఆర్ మాటలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి […]

అందుకే కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్‌లోకి వెళుతున్నారు: విజయశాంతి
Follow us on

హైదరాబాద్: కొంతమంది కాంగ్రెస్ నాయకులు డబ్బులకు ఆశపడే టీఆర్ఎస్‌లోకి వెళుతున్నారని కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శించారు. కేసీఆర్ ఒక అబద్ధాల కోరు, కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలియదా? సోనియా గాంధీ లేకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారా? అంటూ ఆమె ఫైరయ్యారు. అసలైన తెలంగాణ ఇంకా రాలేదు, రానున్న రోజుల్లో కేసీఆర్‌కి ఓటు ఎందుకు వేశామా? అని అనుకోవాల్సిన పరిస్థితి వద్దు అంటూ విజయశాంతి మాట్లాడారు. కేసీఆర్ మాటలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.