బల్కంపేట అమ్మవారికి బంగారు చీర.. సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా మంత్రి తలసాని కానుక

|

Feb 17, 2021 | 12:07 PM

సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకుల తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుతున్నారు టీఆర్‌ఎస్‌ శ్రేణులు. మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్..

బల్కంపేట అమ్మవారికి బంగారు చీర.. సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా మంత్రి తలసాని కానుక
Follow us on

సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకుల తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుతున్నారు టీఆర్‌ఎస్‌ శ్రేణులు. మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ బుధ‌వారం ఉదయం బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ‌కు బంగారు చీర స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు మంత్రి త‌ల‌సాని. ఎల్ల‌మ్మ అమ్మ‌వారికి పంచామృతాల‌తో ప్ర‌త్యేక అభిషేకం, మృత్యుంజ‌య హోమం, ఆయుష్షు హోమం నిర్వ‌హించారు.

ఆల‌య అర్చ‌కులు తెలంగాణ రాష్ర్టం సుభిక్షంగా ఉండాల‌ని ఆశీర్వ‌దించారు. దాతలు కూన వెంకటేశ్ గౌడ్ తదితరులు ఈ చీరను తయారు చేయించారని తెలిపిన తలసాని, తెలంగాణ వాసులకు ఎల్లమ్మ తల్లి ఇలవేల్పుగా నిలిచిందని, అమ్మను దర్శించుకుంటే శుభాలు కలుగుతాయని అన్నారు.

రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తున్న కేసీఆర్, భవిష్యత్తులో దేశానికి కూడా సేవ చేయాలని కోరుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్నపూర్ణ సమక్షంలో అమ్మవారికి బంగారు చీరను సమర్పించారు. అనంతరం సికింద్రాబాద్ మ‌హంకాళి ఆల‌యంలోనూ త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అమీర్‌పేట‌లోని గురుద్వార‌ను సందర్శించిన మంత్రి త‌ల‌సాని.. కేసీఆర్ శ్రేయ‌స్సు కోరుతూ పూజ‌లు నిర్వ‌హించారు.

 

Read more:

ముందు షర్మిల వస్తది.. తర్వాత వారొస్తారు.. తస్మాత్‌ జాగ్రత్త.. మంత్రి గంగుల కమలాకర్‌ సంచలన వ్యాఖ్యలు