మరో తెలంగాణ ఉద్యమం చూస్తారు జాగ్రత్త.. ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌కు గొంతు కలిపిన మంత్రి, ఎమ్మెల్యేలు

|

Feb 21, 2021 | 12:03 AM

అటవీశాఖ అత్యుత్సాహంపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎదురుదాడికి దిగారు. మొన్న మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ వార్నింగ్‌..

మరో తెలంగాణ ఉద్యమం చూస్తారు జాగ్రత్త.. ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌కు గొంతు కలిపిన మంత్రి, ఎమ్మెల్యేలు
Follow us on

అటవీశాఖ అత్యుత్సాహంపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎదురుదాడికి దిగారు. మొన్న మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ వార్నింగ్‌ నుంచి తేరుకోకముందే తాజాగా మంత్రి సత్యవతి రాథోడ్ సహా, ఎంపీ కవిత, నర్సంపేట MLA పెద్ది సుదర్శన్ రెడ్డి బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు సాగులో ఉన్న ప్రతి పోడుభూమి ఆ పేద రైతులకే చెందుతుందని అన్నారు.

పోడుభూముల ఆక్రమణ పేరుతో అటవీశాఖ సిబ్బంది గిరిజనులపై దాడులకు పాల్పడితే సహించేది లేదన్నారు. అడవి నుంచి గిరిజనులను సాగనంపుతాం అంటే సహించేది లేదన్నారు. ఎంపి మాలోతు కవిత కూడా తనదైన శైలిలో ఫారెస్ట్ అధికారుల కవ్వింపు చర్యలపై స్పందించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలను పాటించకుండా మళ్ళీ స్ట్రెంచ్ పనులను మొదలు పెడితే తిరగబడుతామని అన్నారు.

గిరిజనుల కోసం అవసరమైతే మరో తెలంగాణ పోరాటాన్ని చవి చేస్తారని హెచ్చరించారు. పోడు రైతుల పక్షానపోరాడి.. అవసరమైతే జైలుకు వెళ్ళడానికైనా సిద్ధమేనని MLA పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు గిరజన రైతులను వేదించడం మానుకోవాలని హితవు పలికారు.

Read mor:

ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం కానివ్వం.. చంద్రబాబు ఆ పని ఎందుకు చేయలేదన్న వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి