సాధ్వి టార్గెట్‌.. పాత కేసు తిరగదోడే పనిలో ఎంపీ సర్కార్

| Edited By:

May 21, 2019 | 9:22 PM

భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌పై ఉన్న ఓ పాత కేసును తిరగదోడే ఆలోచనలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఉంది. 2007లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ సునీల్ జోషి హత్యకు సంబంధించిన కేసులో.. సాధ్వి నిందితురాలిగా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి లీగల్ ఓపీనియన్ తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సునీల్ జోషి హత్య కేసులో సాధ్వి ప్రజ్ఞా సింగ్‌తో పాటు.. మరో ఏడుగురు నిందితులకు 2017లో దేవాస్ కోర్టు ఊరటనిచ్చింది. ఏళ్ల తరబడి సాగిన […]

సాధ్వి టార్గెట్‌.. పాత కేసు తిరగదోడే పనిలో ఎంపీ సర్కార్
Follow us on

భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌పై ఉన్న ఓ పాత కేసును తిరగదోడే ఆలోచనలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఉంది. 2007లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ సునీల్ జోషి హత్యకు సంబంధించిన కేసులో.. సాధ్వి నిందితురాలిగా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి లీగల్ ఓపీనియన్ తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సునీల్ జోషి హత్య కేసులో సాధ్వి ప్రజ్ఞా సింగ్‌తో పాటు.. మరో ఏడుగురు నిందితులకు 2017లో దేవాస్ కోర్టు ఊరటనిచ్చింది. ఏళ్ల తరబడి సాగిన ఈ కేసులో తీర్పు వెలువడిన తర్వాత ఈ ఎనిమిది మందికి విముక్తి లభించింది. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అయిన జోషిని బైకు మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్చిచంపారు. ఇందుకు సంబంధించి సాధ్వి, వాయుదేవ్ పర్మార్, ఆనంద్ రాజ్ కటారియా, హర్షద్ సోలంగి,లోకేష్ శర్మ, రాజేంద్ర చౌదరి, రామ్ చంద్ర పటేల్, జితేంద్ర శర్మలపై ఐపీసీ 120 (బి), 302 (హత్య) కేసులు నమోదు చేశారు. అయితే సరైన సాక్ష్యాధారులు లేకపోవడంతో మధ్యప్రదేశ్ పోలీసులు కేసును మూసేశారు. ఆ తర్వాత కేసును తొలుత ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు, ఆ తర్వాత దేవాస్ సెషన్స్ కోర్టుకు బదలీ చేశారు.

కాగా, 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలైన సాధ్వి ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. ఈ ఏడాది మొదట్లో బీజేపీలో చేరిన ఆమె భోపాల్ అభ్యర్థిగా పార్టీ టిక్కెట్ పొంది.. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై నిలబడారు.