జగన్ పేరు మార్చాను: లోకేష్

|

Mar 29, 2019 | 7:50 PM

మలికిపురం: తూర్పు గోదావరి జిల్లా మలికిపురంలో మంత్రి నారా లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఆంధ్రుల్ని రాక్షసులన్నారు, తరిమి కొట్టాలన్నారు, మనం తినే తిండిని పేడ అన్నారు.. అలాంటి వ్యక్తి కేసీఆర్‌తో జగన్ ములాఖత్ అయ్యారు. పోలవరం పూర్తి కాకూడదనే లక్ష్యంతో కేసీఆర్ పని చేస్తున్నారని, ముంపు మండలాలను తిరిగి వెనక్కి తీసుకోవాలని చూస్తున్నారని లోకేష్ అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక పోర్ట్ తెలంగాణకు ఇవ్వాలని కోరుతూ ప్రధాని […]

జగన్ పేరు మార్చాను: లోకేష్
Follow us on

మలికిపురం: తూర్పు గోదావరి జిల్లా మలికిపురంలో మంత్రి నారా లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఆంధ్రుల్ని రాక్షసులన్నారు, తరిమి కొట్టాలన్నారు, మనం తినే తిండిని పేడ అన్నారు.. అలాంటి వ్యక్తి కేసీఆర్‌తో జగన్ ములాఖత్ అయ్యారు. పోలవరం పూర్తి కాకూడదనే లక్ష్యంతో కేసీఆర్ పని చేస్తున్నారని, ముంపు మండలాలను తిరిగి వెనక్కి తీసుకోవాలని చూస్తున్నారని లోకేష్ అన్నారు.

ఆంధ్ర రాష్ట్రంలో ఒక పోర్ట్ తెలంగాణకు ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ రాశారని, దీని వెనక పెద్ద కుట్ర జరుగుతుందని చెప్పారు. రేపు బలహీనమైన ముఖ్యమంత్రి వస్తే ఏపీలో కేసీఆర్ చెప్పినట్టే జరుగుతుందని, ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టొద్దని అన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత తాను జగన్‌ పేరు మార్చానని, “కల్వకుంట్ల జగన్ మోడీ రెడ్డి” అని పెట్టానని లోకేష్ అన్నారు.