నరసారావుపేట: గుంటూరు జిల్లా నరసారావుపేటలో ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన రోడ్షోలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్పై విమర్శలు చేశారు.
పవన్కు ఒక్క అత్తారింటికి మాత్రమే దారి తెలుసు. నాకు అన్ని దారులు తెలుసు. నా సైకిల్ చెయిన్ను టీఆర్ఎస్ వాళ్లు తెంపేస్తారని పవన్ అంటున్నాడు.. అది జరిగే పనేనా? దగ్గరకొస్తే సైకిల్ షాక్ కొడుతుంది. ఎవరైనా అడ్డుపడాలని చూస్తే స్పీడ్ పెంచుతాను. అయినా అడ్డం తిరిగితే తొక్కించుకుంటూ వెళతానని చంద్రబాబు హెచ్చరించారు.