ట్విట్టర్ వేదికగా మోదీ, చంద్రబాబు పరస్పర విమర్శలు

| Edited By: Vijay K

Mar 29, 2019 | 7:18 PM

‘మోదీ.. తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చకుండా.. ఏ మొహం పెట్టుకొని ఏపీకి వస్తారు’అని ప్రశ్నించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. హోదా ఇస్తామని, లక్ష కోట్లు దోచుకున్న ఆర్థిక నేరస్థులను కటకటాల వెనుక ఉంచుతానన్న మోదీ.. ఇప్పుడు వారితోనే జట్టుకట్టారంటూ ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు చంద్రబాబు. ‘విభజనతో కుదేలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తానని మాట ఇచ్చిన ఆ మనిషే లక్ష కోట్లు దోచుకున్న స్కామ్ ఆంధ్ర ఆర్థిక నేరస్తులను కటకటాల వెనుక […]

ట్విట్టర్ వేదికగా మోదీ, చంద్రబాబు పరస్పర విమర్శలు
Follow us on

‘మోదీ.. తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చకుండా.. ఏ మొహం పెట్టుకొని ఏపీకి వస్తారు’అని ప్రశ్నించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. హోదా ఇస్తామని, లక్ష కోట్లు దోచుకున్న ఆర్థిక నేరస్థులను కటకటాల వెనుక ఉంచుతానన్న మోదీ.. ఇప్పుడు వారితోనే జట్టుకట్టారంటూ ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు చంద్రబాబు.

‘విభజనతో కుదేలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తానని మాట ఇచ్చిన ఆ మనిషే లక్ష కోట్లు దోచుకున్న స్కామ్ ఆంధ్ర ఆర్థిక నేరస్తులను కటకటాల వెనుక ఉంచుతానని చెప్పాడు. రైతులను, యువకులను, మైనార్టీలను, ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టాడు. ఒక్క విభజన హామీ కూడా అమలు చేయకుండా, ఇప్పుడు వైసీపీకి సాయం చేయటానికి నిస్సిగ్గుగా ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నాడు. రాష్ట్ర ప్రజలారా మేల్కోండి. మన ధర్మ పోరాటంతో రాష్ట్ర ద్రోహులకు బుద్ధి చెప్పే ఆ సమయం ఆసన్నమైంది’అని చంద్రబాబు పేర్కొన్నారు.

‘చంద్రబాబుతోనే రాష్ట్రం బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేస్తుందన్న పెద్దమనిషి మాట నిలబెట్టుకోవడం చేతకాక, ఆర్థిక నేరస్తులతో కుమ్మక్కై, రాష్ట్రాన్ని, దేశాన్ని భ్రష్టుపట్టించి, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశాడు’ అంటూ మండిపడ్డారు చంద్రబాబు.

ఈ సాయంత్రం నేను కర్నూలులో ఒక ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తాను. మహోన్నత ఎన్టీఆర్ ఆదర్శాలకు నీళ్లొదిలి, మోసపూరిత తెలుగుదేశం పాలనలో ఆంధ్ర ప్రదేశ్ లో అవినీతి, బలహీనమైన పరిపాలనతో అన్ని రంగాలలో తిరోగమనంలో ఉంది. యువత కలలు నెరవేర్చటానికి నేను ఆంధ్ర ప్రదేశ్ ఆశీస్సులు కోరుకుంటున్నాను’.అన్నారు ప్రధాని.