శిక్షణ విమానం కూలి ఫైలట్ దుర్మరణం
ఉత్తరప్రదేశ్లో విషాదం చోటుచేసుకుంది. ఈ ఉదయం ఓ శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ దుర్మరణం పాలయ్యాడు.
ఉత్తరప్రదేశ్లో విషాదం చోటుచేసుకుంది. ఈ ఉదయం ఓ శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ దుర్మరణం పాలయ్యాడు. కాగా, మరో ఇద్దరు ఫైలట్లు క్షేమంగా బయటపడగా, మరొకరి ఆచూకీ గల్లంతైంది. అజమ్గఢ్ జిల్లాలోని కుశ్వాపురవా గ్రామానికి సమీపంలో ట్రాయిన్ విమానం అకస్మాత్తుగా సోమవారం ఉదయం 11.20 గంటల ప్రాంతంలో కూలిపోయింది. దీంతో అది పూర్తిగా ధ్వంసమయ్యిందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో నలుగురు ఫైలట్లు ఉన్నారని అధికారులు తెలిపారు. దురదృష్టవశాత్తు ఒకరు మరణించగా, మరో ఇద్దరు ప్యారాచుట్ సహాయంతో కిందికి దిగారని పోలీసులు చెప్పారు. మరొకరి జాడ తెలియడం లేదని వెల్లడించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్రామస్థుల సహాయంతో శిథిలాల నుంచి మృతదేహాన్ని వెళికి తీశామని తెలిపారు. తప్పిపోయిన వ్యక్తికోసం గాలిస్తున్నామని వెల్లడించారు.
Pilot killed after trainer aircraft crashes in #uttarpradesh’s #Azamgarh. A senior police officer said people in Kushapurwa village told the police that the aircraft appeared to have lost height all of a sudden. It broke into several pieces when it crashed on the ground, he said. pic.twitter.com/cMZJ9XCk9B
— The Subsequent (@TheSubsequent) September 21, 2020