
ఆస్ట్రేలియాలో సెరోజా తుపానుతో గంటకు సుమారు 170 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీశాయి.

పశ్చిమ ఆస్ట్రేలియాలోని పలు చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. వందల ఇళ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

మూడో కేటగిరికీ చెందిన ఈ తుపాను.. పెర్త్కు 580 కిలోమీటర్ల దూరంలోని కాలబర్రీ పట్టణం వద్ద తీరం దాటింది

అయితే.. ఈ తుపాను విధ్వంసంలో ఎవరూ గాయపడినట్లు సమాచారంలేదు. ప్రస్తుతం.. సెరోజా తుపాను బలహీనపడినట్లు ఆస్ట్రేలియా వాతావరణ విభాగం పేర్కొంది.

ఈ తుపాను ఆస్ట్రేలియాను చేరకముందు ఇండోనేషియా, తిమోర్ లెస్టోలను అతలాకుతలం చేసింది. ఆ రెండు దేశాల్లో సెరోజా ధాటికి 174 మంది మరణించగా.. 48 మంది గల్లంతయ్యారు.