
పోలాండ్ తెలుగు అసోసియేషన్ (PoTA) వారు ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి వేడుకలను క్రకోవ్ (Cracow), గడన్స్క్(Gdansk) నగరాల్లో7 రోజులు పాటు ఎంతో వేడుకగా మరియు భక్తి శ్రద్దలతో నిర్వహించారు.

అయితే 7thసెప్టెంబర్, శనివారం రోజున విగ్రహ ప్రతిష్టాపనతో మొదలైన ఈ కార్యక్రమం, ప్రతి రోజు హారతి, దంపతుల పూజలు, గణేశుడి భజనలు తో ప్రతి ఒక్కరిని ఎంతగానో అలరించాయి.

ఈ వినాయకచవితిని మన తెలుగు వారితో పాటు, ఇండియన్ కమ్యూనిటీ అనగా వివిధ రాష్ట్రాల ప్రవాస భారతీయలు అందరూ కూడా PoTA మండపాలను దర్శించి, స్వామివారి ఆశీస్స్సులుతో పాటు ప్రసాదాన్నిస్వీకరించటం జరిగింది.

అంతే కాకుండా ఈ కార్యక్రమాలలో పోలాండ్ దేశస్సులు సైతం ఎంతో భక్తిశ్రద్దలతో పాల్గొని బొజ్జ గణపతి యొక్క విశిష్టతను తెలుసుకున్నారు. Krakow లో నిర్వహించిన లడ్డు వేలంలో IT ఉద్యోగులు పాల్గొని స్వామివారి లడ్డుని 70 వేలకు దక్కించుకున్నారు.

ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగటానికి PoTA చాప్టర్ కోర్ కమిటీ సభ్యులంతా ఎంతో నిబద్దతో శ్రమించారని, వారి యొక్క సహకారం మరువలేనిదని చాప్టర్ ప్రెసిడెంట్ చంద్ర అల్లూరి, వైస్ ప్రెసిడెంట్ సుమన్ కుమార్ జనగామ తెలిపారు.

చివరి రోజైన 14 సెప్టెంబర్, శనివారంనాడు ఆ గణ నాధున్ని నిమజ్జనం చేసి స్వామి వారి ఆశీస్స్సులుతో వచ్చే సంవత్సరం వరకూ వేచి చూస్తామని PoTA ప్రెసిడెంట్ ఐన చంద్ర భాను గారు తెలిపారు.