
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అక్టోబర్ 31న హాలోవీన్ ఫెస్టివల్ను జరుపుకోవడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. ఈ పండుగను క్రైస్తవులు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. క్రీస్తుపూర్ం నుంచి ఐర్లాండ్, యూకే, ఉత్తర ఫ్రాన్స్లో ఉన్న సెల్ట్స్ తెగ ప్రజలు ఈ హాలోవీన్ వేడుకలకు జరుపుకొనేవారు. ఈ తెగ ప్రజలకు నవంబర్ 1 నుంచి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. నవంబర్ నెలను సెల్ట్స్ తెగ ప్రజలు మృత్యువుతో పోల్చేవారు. ఎందుకంటే ఈ నెలలో చలి ఎక్కువగా ఉంటుందని, వ్యాధులు ప్రభలి మరణాలు ఎక్కువగా సంభవిస్తాయని వారి నమ్మకం. అంతేకాకుండా ఈ రోజున తమ పూర్వికుల ఆత్మలు భూమిపైకి వస్తాయని విశ్వసిస్తారు. అందువల్ల అక్టోబర్ 31న భయంకరమైన దుస్తులను ఈ తెగ వారు ధరిస్తారు. ఇలా ధరించడం మూలంగా భూమిపైకి వచ్చిన ఆత్మలు వాళ్లను కూడా ఆత్మలుగానే భావించి తిరిగి వెళ్లిపోతాయట. అలాగే ఈ ఆత్మలు ఇళ్లలోకి ప్రవేశించకుండా ఇంటి గుమ్మాల ముందు గుమ్మడికాయలు రకరకాల ఆకారాల్లో కట్ చేసి పెట్టి, వాటిల్లో దీపాలు వెలిగిస్తారు. అందువల్ల నవంబర్ 1 ముందు రోజు రాత్రి వీధుల్లో మంటలు వేసి, జంతువులను బలిస్తారు. అనంతరం ఆ జంతువుల తలలను నెత్తిన పెట్టుకుని, వాటి చర్మాలను శరీరంపై ధరిస్తారు. ఇలా చేస్తే వ్యాధులు దరి చేరవని చెబుతారు. అంతేకాకుండా ఒకప్పుడు యూరప్లోని క్రైస్తవులు జరుపుకునే ఈ పండగ.. తర్వాత కాలాల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అన్ని మతాల వాళ్లు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మన దేశంలో అత్యంత భయం గొలిపే ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

మనదేశంలోని అత్యంత భయం గొలిపే ప్రదేశాల్లో రాజస్థాన్లోని భంగర్ కోట అగ్రస్థానంలో ఉంది. ఓ తాంత్రికుడు ఈ ప్యాలెస్పై చేతబడి చేశాడని, అప్పటి నుంచి ఇది దెయ్యాల కోటగా మారిందని స్థానికులు చెబుతారు. అంతేకాడు.. సూర్యాస్తమయం తర్వాత ఈ కోటలోకి ప్రవేశం నిషేధించారు కూడా. చాలా మంది వ్యక్తులు ఇక్కడ దెయ్యం పట్టినట్లు (పారానార్మల్) ప్రవర్తిస్తారట.

హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా దెయ్యాలు ఉంటాయని కొందరు చెబుతారు. అక్కడి హోటళ్లలో వేలిముద్రలు, విచిత్రమైన నీడలు, తలుపులు వాటంతట అవే తెరచుకోవడం, మూసుకుపోవడం, విచిత్రమైన చప్పుళ్లు విన్పిస్తుంటాయట.

దేశంలోని అందమైన బీచ్లలో గుజరాత్ని డుమాస్ బీచ్ ఒకటి. ఐతే ఈ బీచ్లో కొందరు వ్యక్తులు మృతదేహాలకు దహనసంస్కారాలు నిర్వహిస్తాయరని, అవి ఆ తర్వాత దెయ్యాలుగా మారి అక్కడ సంచరిస్తుంటాయని చెబుతుంటారు.

సిమ్లాలోని కల్కా రోడ్లో టన్నెల్ నెం. 103 ఉంది. ఈ ప్రదేశంలో చాలా ఆత్మలు ఉన్నాయని చెబుతుంటారు.