
నారింజ పళ్లను తినడం వల్ల జలుబు చేస్తుందని చాలా మంది నమ్ముతారు. ఇలా చాలా మందిని గందరగోళానికి గురిచేస్తుంది. ఇదే విషయాన్ని ఆరోగ్య నిపుణుల దృష్టికి తీసుకెళ్లినప్పుడు వారు అసలు విషయాన్ని తెలిపారు. శీతాకాలంలో నారింజ తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.

శీతాకాలంలో ఈ పండ్లు తినడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు. నారింజ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని యాంటీఆక్సిడెంట్లు పెరుగుతాయి, ఇది కణాల నష్టాన్ని నివారించడంలో సహాయపడుతాయని వివరించారు.

నారింజలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది, ఇది చర్మ తేమతో పాటు ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ నారింజ పండ్లను నార్మల్గా తిన్నా.. లేదా రసంలా తీసుకున్నా చర్మానికి సహజమైన కాంతి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

నారింజ: నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని దృఢంగా, ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు ఈ పండ్లను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుని, పుష్కలంగా నీరు తాగితే, కొన్ని వారాలలోనే మీ చర్మంలో తేడాను గమనించవచ్చు. తగినంత నిద్రపోవడం, ఎండ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండటం కూడా ముఖ్యం.

నారింజ తినడం వల్ల జలుబు వస్తుందా? అరు విషయానికి వస్తే.. ఇక్కడ మీ ఈ ఆలోచన పూర్తిగా తప్పు అని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇది జలుబుకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది. అయితే, మీకు ఇప్పటికే గొంతు నొప్పి లేదా టాన్సిల్ సమస్యలు ఉంటే, ఆ సమయంలో నారింజలకు దూరంగా ఉండడం మంచిందని నిపుణులు చెబుతున్నారు.

NOTE : పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదిక నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే.. వైద్యులను సంప్రదించడం మంచిది