
భారత్ జనాభాలో దాదాపు 38% నుండి 42% మంది శాఖాహారులు ఉన్నారు. జైన మతం, హిందూ మతం, బౌద్ధమతంలోని అహింస సూత్రాల కారణంగా భారతదేశం శాఖాహారంలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. దీంతో మన దేశం అత్యధిక శాతం శాఖాహారాన్ని కలిగి ఉన్న దేశాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది.

నేటి బిజీగా జీవనశైలిలో చాలా మందికి ఆహారంపై తగిన శ్రద్ధ ఉండటం లేదు. దీంతో రోజులో మూడు పూటలు అన్నం తింటున్నారు. అందుకు మరో కారణం కూడా ఉంది. అన్నం త్వరగా తయారవుతుంది. జీర్ణం కావడం సులభం. పైగా చాలా మందికి అన్నం తినకపోతే కడుపు నిండినట్లు అనిపించదు. అయితే రాత్రిపూట అన్నం తినడం అనారోగ్యకరమైన అలవాటని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మాంసాహార అలవాట్లకు ప్రసిద్ధి చెందిన బ్రెజిల్ కూడా మారుతోంది. ఇప్పుడు అక్కడ జనాభాలో దాదాపు 14% మంది శాఖాహారులు ఉన్నారు. ఈ ధోరణి ముఖ్యంగా పెద్ద నగరాల్లో కనిపిస్తుంది.

ఇజ్రాయెల్ జనాభాలో దాదాపు 13% మంది శాఖాహారులు ఉన్నారు. 'కోషర్' ఆహార చట్టాలు, 'శాకాహారి' ఉద్యమం ఇక్కడ చాలా ప్రభావవంతమైనవి. టెల్ అవీవ్ నగరాన్ని ప్రపంచంలోని 'శాకాహారి రాజధాని' అని కూడా పిలుస్తారు.

తైవాన్లోనూ దాదాపు 12% నుండి 13% జనాభా శాఖాహారులు. బౌద్ధమతం ప్రభావం, కఠినమైన ఆహార-లేబులింగ్ చట్టాల కారణంగా అధిక సంఖ్యలో శాఖాహారులు ఉన్నారు.