
శీతాకాలంలో చలి తీవ్రతకు చర్మం పొడి బారడం సహజం. అయితే ఈ విధంగా పొడి చర్మం సమస్య ఉన్న వారు ముఖానికి ముల్తానీ మిట్టిని ఎట్టి పరిస్థితుల్లోనూ పూయకూడదు. ముల్తానీ మిట్టి చర్మం సహజ తేమను గ్రహిస్తుంది. ఇది పొడిబారడం, బిగుతుగా ఉండటం, పొరలుగా మారడం వంటి సమస్యలను మరింత పెంచుతుంది.

ముల్తానీ మట్టి బ్లాక్ హెడ్స్ ను కూడా తగ్గిస్తుంది. దీని సహజ బంకమట్టి చర్మం రంధ్రాల నుంచి మురికి, నూనె, బ్యాక్టీరియాను బయటకు పంపిస్తుంది. ఇది మొటిమలు, బ్లాక్ హెడ్స్ ను తగ్గిస్తుంది.

ముల్తానీ మట్టి మృతకణాలను తొలగిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. ఎండ వల్ల చర్మం నల్లబడటాన్ని తగ్గిస్తుంది.

తామర, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులతో ఇప్పటికే బాధపడేవారి చర్మం సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఈ సమస్య ఉన్న వారు ముల్తానీ మిట్టి వాడితూ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. ముఖంపై గాయాలు, కోతలు, ఇన్ఫెక్షన్లు ఉంటే ముల్తానీ మిట్టిని పూయకూడదు. మట్టిని పూయడం వల్ల గాయం నయం కావడానికి బదులుగా ఇన్ఫెక్షన్ పెరుగుతుంది.

ముల్తానీ మట్టి చర్మ అసమానతలను తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన చర్మ ఆకృతిని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ముల్తానీ మట్టిని రోజ్ వాటర్, పెరుగు, తేనె లేదా పాలు వంటి వాటితో కలిపి ఫేస్ ప్యాక్గా అప్లై చేయవచ్చు.