
ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి చెట్టకు ఒక ప్రత్యేకత ఉంది. భూమిపై ఉన్న మానవవాళిని కాపాడటానికి, జంతువుల ఆసరాకు చెట్లు చాలా అవసరం. అయితే భూమిపై కొన్ని ప్రమాదకరమైన, విషపూరిత చెట్లు ఉన్నాయని మీకు తెలుసా. అంతేకాదు ఆ చెట్లను తాకినా, వాటి కాయలు తిన్నా నిమిషంలోనే మనుషులు చనిపోతారు.

ఆస్ట్రేలియాలో కనిపించే జింపి స్ట్రింగర్ చెట్టుకు ముళ్ళుంటాయి. ముళ్ళ కారణంగా ఆ చెట్టు అందంగా కనిపిస్తుంది. కానీ ఈ ముళ్ళు చాలా ప్రమాదకరమైనవి. ఈ ముళ్ళలో విషం ఉంటుంది. ఆ విషం మానవ శరీరం లోపలికి వెళితే, మరణం కూడా సంభవిస్తుంది.

సెర్బెరా ఓడోలంను 'సూసైడ్ ట్రీ' అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు కాయలు, పండ్లు చాలా విషపూరితమైనవి. ఈ విషాన్ని ఒక వ్యక్తికి ఇస్తే, అతడు క్షణాల్లో మరణిస్తాడు.

'టాక్సస్ బకాటా' అని పిలువబడే ఈ చెట్టు ఐరోపా, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో కనిపిస్తుంది . విత్తనాలు మినహా ఈ చెట్టులోని ప్రతి భాగంలో 'టాక్సిన్' అనే విషం ఉంది. ఈ విషం ప్రమాదవశాత్తూ మనిషి శరీరంలోకి వెళ్తే.. క్షణాల్లో చనిపోతాడు.

అమెజాన్ రెయిన్ఫారెస్ట్లో కనిపించే చెట్టు.. దాని పండు కారణంగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చెట్టుగా పరిగణించబడుతుంది. ఈ చెట్టు కాయలు.. పండిన తరువాత బాంబులాగా పేలతాయి. ఒక వ్యక్తి ఆ సమయంలో ఆ పరిసర ప్రాంతాలలో ఉంటే తీవ్రంగా గాయపడతాడు.