
ఓ వైపు ఎండలు మండుతూ ఉన్నాయి ఇంకో వైపు జనాలు ఏ ఫుడ్ తింటే వేసవికాలంలో బాడీకి చలువ చేస్తుందా అని గూగుల్లో వెతుకుతున్నారు. అయితే, ఈ వడలు తింటే కడుపును చిటికెలో క్లీన్ చేసి శరీరాన్ని కూల్ గా చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి. అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

మినపప్పు ఆలూ వడలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు మినప్పప్పు, రెండు బంగాళాదుంపలు, ఒక పెద్ద ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, టేబుల్ స్పూన్ జీలకర్ర , నాలుగు కరివేపాకు ఆకులు, కొత్తిమీర ఆకులు, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి , రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. ఇంకా బియ్యప్పిండి, నూనె కూడా తీసుకోవాలి.

ముందుగా మినప్పప్పును తీసుకుని కనీసం 5 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఈ నీటిని వంపేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఈ పిండిలో ఉడకబెట్టిన ఆలూ వేసుకోవాలి. వీటితో పాటు కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ , అర టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, అర టేబుల్ మసాలా పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి.

చివర్లో వడలను ఇలా వేయించుకోవాలి: ఈ వడలు కరకరలాడేందుకు దీనిలో ఒక కప్పు బియ్యప్పిండిని కలపాలి. ఇంకా ఈ కడాయిలో కొద్దిగా నూనె వేయాలి. ఆ తరవాత చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని వడలా మాదిరి చేయాలి. అయితే ఈ నూనెలో ఒక వైపు కాలిన తరవాత రెండో వైపు కూడా రంగు మారే వరకు బాగా వేయించాలి.

విలేజ్ స్టైల్ మినపప్పు ఆలూ వడలను సాయంత్ర సమయంలో వేడి వేడి టీతో తింటే రుచి అదిరిపోతోంది. ఇంకా మినపప్పు, ఆలూ వడలు కాంబోతో చేస్తే అద్భుతంగా ఉంటాయి. ఇది కరకరలాడుతూ, మెత్తగా చేసుకుంటే ఈ వడలు పిల్లలతో పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా వేసవికాలంలో బాడీకి చలువ చేస్తాయి. విలేజ్ స్టైల్లో చేసే ఈ వడలను కొబ్బరి చట్నీతో తింటే సూపర్ ఉంటుంది.