Aadi Krithigai 2024: ఒంగోలులో ఘనంగా నిర్వహించిన ‘ఆడికృత్తిక’ మహోత్సవం.. ఫొటోలు వైరల్‌

| Edited By: Srilakshmi C

Jul 29, 2024 | 3:45 PM

ఆషాడ మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చే రోజు సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ ఏడాది జూలై 29వ తేదిన ఈ నక్షత్రం రావడంతో ఒంగోలులో ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. సుబ్రహ్మణ్యస్వామి భక్తులు ఈరోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి శుచియైన తరువాత చలిమిడితో ప్రమిద చేసి అందులో ఆవు నేతితో మూడు వత్తుల దీపం వెలిగిస్తారు..

1 / 5
ఆషాడ మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చే రోజు సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు. దీనిని 'ఆడికృతిక' అంటారు. ఈ ఏడాది జూలై 29వ తేదిన ఈ నక్షత్రం రావడంతో ఒంగోలులో ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. సుబ్రహ్మణ్యస్వామి భక్తులు ఈరోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి శుచియైన తరువాత చలిమిడితో ప్రమిద చేసి అందులో ఆవు నేతితో మూడు వత్తుల దీపం వెలిగిస్తారు.

ఆషాడ మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చే రోజు సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు. దీనిని 'ఆడికృతిక' అంటారు. ఈ ఏడాది జూలై 29వ తేదిన ఈ నక్షత్రం రావడంతో ఒంగోలులో ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. సుబ్రహ్మణ్యస్వామి భక్తులు ఈరోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి శుచియైన తరువాత చలిమిడితో ప్రమిద చేసి అందులో ఆవు నేతితో మూడు వత్తుల దీపం వెలిగిస్తారు.

2 / 5
ఈ దీపాన్ని శివుడు, పార్వతీ దేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు ఉన్న చిత్రపటం ముందు వెలిగించి చిమ్మిలి, పచ్చి పాలు, వడపప్పు, అరటి పండ్లు, తాంబూలం ఇవన్నీ నివేదించి, సుబ్రహ్మణ్యుని స్తోత్రాలు, సుబ్రహ్మణ్య జన్మ వృతాంతం చదువుకుని, సాయంత్రం వరకూ ఉపవాసం ఉంటారు. ఇది తమిళనాడులో ఎంతో విశేషంగా జరుపుకునే పండుగ. తెలుగు రాష్ట్రాల్లో అంతగా ప్రాచుర్యం ఉండదు.

ఈ దీపాన్ని శివుడు, పార్వతీ దేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు ఉన్న చిత్రపటం ముందు వెలిగించి చిమ్మిలి, పచ్చి పాలు, వడపప్పు, అరటి పండ్లు, తాంబూలం ఇవన్నీ నివేదించి, సుబ్రహ్మణ్యుని స్తోత్రాలు, సుబ్రహ్మణ్య జన్మ వృతాంతం చదువుకుని, సాయంత్రం వరకూ ఉపవాసం ఉంటారు. ఇది తమిళనాడులో ఎంతో విశేషంగా జరుపుకునే పండుగ. తెలుగు రాష్ట్రాల్లో అంతగా ప్రాచుర్యం ఉండదు.

3 / 5
తమిళనాడుకు సమీపంలో ఉన్న ఊర్లలో మాత్రమే జరుపుతుంటారు. అయితే గత మూడు వందల ఏళ్లుగా ఒంగోలులో తమిళనాడు నుంచి వలస వచ్చి స్థిరపడిన తమిళులు ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ పండుగలో వేల్‌కావడి ఉత్సవం ప్రత్యేకంగా నిర్వహిస్తారు.

తమిళనాడుకు సమీపంలో ఉన్న ఊర్లలో మాత్రమే జరుపుతుంటారు. అయితే గత మూడు వందల ఏళ్లుగా ఒంగోలులో తమిళనాడు నుంచి వలస వచ్చి స్థిరపడిన తమిళులు ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ పండుగలో వేల్‌కావడి ఉత్సవం ప్రత్యేకంగా నిర్వహిస్తారు.

4 / 5
కొంతమంది భక్తులు మొక్కులు తీర్చుకునే క్రమంలో బుగ్గలు, వీపుపై శూలాలు గుచ్చుకుంటారు. పురుషులే కాకుండా మహిళలు కూడా ఈ వేల్‌ కావడి ఉత్సవంలో పాల్గొని బుగ్గలపై శూలాలు గుచ్చుకుని భక్తి శ్రద్దలతో స్వామిని కొలుస్తారు. ఈ సందర్బంగా ఒంగోలులో భక్తులు బుగ్గులకు శూలాలు గుచ్చుకుని ప్రదర్శన నిర్వహించారు.

కొంతమంది భక్తులు మొక్కులు తీర్చుకునే క్రమంలో బుగ్గలు, వీపుపై శూలాలు గుచ్చుకుంటారు. పురుషులే కాకుండా మహిళలు కూడా ఈ వేల్‌ కావడి ఉత్సవంలో పాల్గొని బుగ్గలపై శూలాలు గుచ్చుకుని భక్తి శ్రద్దలతో స్వామిని కొలుస్తారు. ఈ సందర్బంగా ఒంగోలులో భక్తులు బుగ్గులకు శూలాలు గుచ్చుకుని ప్రదర్శన నిర్వహించారు.

5 / 5
స్వామి వారి రధాన్ని వీపుపై గుచ్చుకున్న కొక్కేలతో లాగి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం కొండపై ఉన్న సుబ్రహ్మణ్యేరస్వామి ఆలయానికి చేరుకుని ఆక్కడ గుచ్చిన శూలాలను తొలగించుకుంటారు. తమిళనాడు నుంచి మూడు తరాల క్రితం తరలివచ్చిన తమ పూర్వీకులు ఈ వేల్‌ కావడి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆ పరంపరలో భాగంగా వారి వారసులుగా తాము కూడా గత ఇరవై ఏళ్ళుగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని భక్తులు చెబుతున్నారు.

స్వామి వారి రధాన్ని వీపుపై గుచ్చుకున్న కొక్కేలతో లాగి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం కొండపై ఉన్న సుబ్రహ్మణ్యేరస్వామి ఆలయానికి చేరుకుని ఆక్కడ గుచ్చిన శూలాలను తొలగించుకుంటారు. తమిళనాడు నుంచి మూడు తరాల క్రితం తరలివచ్చిన తమ పూర్వీకులు ఈ వేల్‌ కావడి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆ పరంపరలో భాగంగా వారి వారసులుగా తాము కూడా గత ఇరవై ఏళ్ళుగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని భక్తులు చెబుతున్నారు.