
రాత్రిపూట మిగిలిపోయిన చికెన్ కూరమళ్ళి వేడి చేసి చిన పిల్లలకు పెడితే విరోచనాలు, వాంతులు, కడుపు నొప్పి సమస్యల వస్తాయి. ఎందుకంటే, వేడి చేసిన చికెన్ విషమవుతుందని నిపుణులు అంటున్నారు.

చికెన్ మళ్ళీ మళ్ళీ వేడి చేసి తింటే దానిలో ఉన్న ప్రోటీన్ విషంగా మారుతుంది. కొద్దిగా కూర మిగిలాగానే దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి ఉదయం వేడి చేసి తింటారు. ఇది మంచి పద్ధతి కాదని వైద్యులు చెబుతున్నారు.

కోడిగుడ్లు కూడా రెండో సారి వేడి చేసి తినకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇలా తింటే జీర్ణ సంబధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఇంకా అన్నం కూడా పదే పదే వేడి చేసి తినొద్దు. ఇలా చేస్తే దానిలో ఉండే మంచి ప్రోటీన్స్ హానికర బ్యాక్టీరియాగా మారుతుంది. దీని వలన వాంతులు అయ్యే అవకాశం ఉంది.

పాలకూరను కూడా రెండో సారి వేడి చేసి తినొద్దు అలా తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.