
పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కర్కుమిన్ మనకు ఎంతో మేలు చేస్తాయి. ఇది మన చర్మాన్ని మెరుస్తూ, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పసుపు నీళ్లతో ముఖాన్ని కడుక్కోవడం వల్ల కొద్ది రోజుల్లోనే తేడా కనిపించడం ప్రారంభమవుతుంది. పసుపు నీళ్లతో ముఖం కడుక్కోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

పసుపు నీరు ముఖానికి మెరిసే ఛాయను కలిగిస్తుంది. చర్మ సంబంధిత సమస్యలకు పసుపు నీరు చాలా మంచిది. రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలు తొలగిపోతాయి. పసుపులో ఉండే పోషకాలు చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడతాయి. పసుపు నీరు చర్మం దెబ్బతిన్న కణాలను రిపేర్ చేస్తుంది. ముఖంపై మచ్చలు, పిగ్మెంటేషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

పసుపు పిత్త ఉత్పత్తిని సక్రియం చేస్తుంది. ఇది అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పటికే ఉన్న పిత్తాశయ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. పసుపును అధిక మోతాదులో తీసుకుంటే కిడ్నీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు పెరుగుతాయి.

అల్జీమర్స్ వ్యాధి బారినపడకుండా మనల్ని మనం కాపాడుకునేందుకు పరగడపున పసుపు నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. అంతేకాదు.. పసుపు నీళ్లు తాగడం వల్ల రక్తాన్ని శుద్ధి చేసుకోవచ్చు. తద్వారా శరీరంలో విషపదార్థాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. పసుపు నీళ్లను తాగడం ద్వారా శరీరంలో గాల్బ్లాడర్ ద్వారా బైల్ ఉత్పత్తి పెరుగుతుంది. పసుపు నీళ్లలోని యాంటీ క్యాన్సర్ గుణాలు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.

పసుపు కలిపిన పాలు తాగితే దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అలెర్జీ ప్రతిచర్యలకు దారి తీస్తుంది. మీలో కూడా ఈ లక్షణం కనిపిస్తే, పసుపు కలిపిన పాలు తాగడం మానేసి, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.