
మూత్ర పిండాలు కూడా శరీరం భాగాల్లో ముఖ్యమైన అవయవాలు. ప్రస్తుత కాలంలో కిడ్నీలు ఫెయిల్ చనిపోతున్నవారు చాలా మంది ఉన్నారు. కిడ్నీలు శరీరంలోని ఎన్నో ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. అలాంటి కిడ్నీలు ఒక్కసారి చెడిపోయాయంటే.. ఆ తర్వాత జీవించడం చాలా కష్టం. కాబట్టి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.

కిడ్నీల ఆరోగ్యాన్ని పెంచడంలో డ్రై ఫ్రూట్స్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ప్రతి రోజూ కొంత మోతాదులో డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి. ఇవి తినడం వల్ల కిడ్నీల ఆరోగ్యంగా పని చేస్తాయి. అంతే కాకుండా ఇతర శరీర భాగాలకు కూడా పోషణ అందుతుంది.

ప్రతి రోజూ యాపిల్ తింటే డాక్టర్కు దూరంగా ఉండొచ్చు. అందుకే ప్రతి రోజూ ఒక యాపిల్ తినమని వైద్యులు సూచిస్తూ ఉంటారు. యాపిల్స్లో పెప్టిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది హైబీపీని, కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుంది. అదే విధంగా కిడ్నీలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.

ప్రతి రోజూ వెల్లుల్లి తినడం వల్ల కూడా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. వెల్లుల్లిలో అల్లిసిన్ అనేది ఉంటుంది. ఇది మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే మూత్ర పిండాలు పనితీరు మెరుగు పడేలా చూస్తుంది.

అదే విధంగా చేపలను కూడా తింటూ ఉండాలి. చికెన్, మటన్ కంటే చేపలు తినడం శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. చేపల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మూత్ర పిండాల పనితీరును మెరుగు పరచడమే కాకుండా.. కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు రాకుండా చేస్తుంది,