
మూడో రోజు రూ.32.59 కోట్ల రుణమాఫీ చేసినట్లు తెలంగాణ సర్కార్ వెల్లడించింది. 11,435 మంది రైతుల ఖాతాలకు నిధులు బదిలీ చేసినట్లు తెలిపింది.

రుణమాఫీతో పాటు రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరెంటు సరఫరాతో రైతాంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది

25వేల పైన తక్కువ మొత్తం ఉన్న వారితో ప్రారంభించి నెలాఖరు వరకు యాభై వేల లోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 50 వేల రూపాయల్లోపు రుణాలున్న వారికి మాత్రమే ప్రస్తుతం నగదు జమచేస్తున్నారు.

సాంప్రదాయ సాగును వీడి పంటల మార్పిడి మీద రైతులు దృష్టి సారించాలిరైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించాలని ప్రభుత్వం కోరింది

ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ను ఏర్పాటు చేశామని.. ఇది స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అవసరాలను గుర్తించి రైతులు వేయాల్సిన పంటలను సూచిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.