రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సందడి చేస్తున్న తరుణంలో తాజాగా చైనాకు చెందిన ZTE సంస్థ కొత్త ఫోన్ను తీసుకొచ్చింది. ZTE Axon 30 విడుదల చేసిన ఈ ఫోన్లో ఏకంగా 12 జీబీ ర్యామ్ను అందించడం విశేషం. ఇంత ఎక్కువ ర్యామ్తో వచ్చిన ప్రపంచంలోనే తొలి స్మార్ట్ ఫోన్గా పేరు తెచ్చుకుంది.
ఈ ఫోన్లోని ఇతర ఫీచర్ల విషయానికొస్తే.. 18 జీబీ ర్యామ్తో పాటు 1టీబీ ఇంటర్నల్ స్టోరేజీని అందించారు. ఈ ఫోన్లో 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.
ఇందులో 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్+ కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించారు. ఇక ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 888 చిప్సెట్ ప్రాసెసర్ను ఇచ్చారు.
ఇక ఈ ఫోన్ రెండు ఎడిషన్స్లో అందుబాటులో ఉంది. 128 జీబీ ర్యామ్+1టీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 82,068గా కాగా.. ZTE Axon 30 Ultra Vanilla Edition 8 జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 55000గా ఉంది.
ఈ ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 65 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 4600 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు.