మరికొన్ని రోజుల్లో దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో కంపెనీలు 5జీ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా షావోమి కొత్త రెడ్మీ ఫోన్ను విడుదల చేసింది.
రెడ్ మీ నోట్ 10టీ 5జీ పేరుతో మంగళవారం భారత మార్కెట్లోకి రెండు రకాల స్టోరేజ్ వేరియంట్లతో ఈ ఫోన్లను లాంచ్ చేశారు. ఈ ఫోన్ను జులై 26 నుంచి అమెజాన్తో పాటు ఎమ్ఐ.కామ్, ఎమ్ఐ స్టోర్లలో అందుబాటులోకి రానున్నాయి.
ధర విషయానికొస్తే.. రెడ్మీ నోట్ 10టీ 5జీ (4 జీబీ + 64 జీబీ స్టోరేజ్) వేరియంట్ ధర రూ.13,999 ఉండగా, 6 జీబీ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999గా నిర్ణయించారు.
6.5 అంగుళాల ఫుల్-హెచ్ డి ప్లస్ హోల్-పంచ్ డిస్ ప్లే ఉండే ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయుఐ 12పై పనిచేస్తుంది. ఈ ఫోన్లో మీడియాటెక్ డిమెన్సిటీ 700 ప్రాసెసర్ను అందించారు.
ఇక కెమెరా విషయానికొస్తే.. 48 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అదనపు ఆకర్షణ.
18 వాట్స్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్తో కూడిన 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీని ఈ ఫోన్కు ప్రత్యేకంగా అందించారు. రెడ్ మీ బ్రాండ్తో భారత్లో విడుదలైన తొలి 5జీ ఫోన్ ఇదే కావడం విశేషం.