
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ను తీసుకొస్తోంది. గత నెలలో వివో వై300 ప్లస్ పేరుతో ఫోన్ తీసుకురాగా.. తాజాగా వివో వై300 పేరుతో ఈ కొత్త ఫోన్ను లాంచ్ చేస్తోంది.

ఈ ఫోన్ను మొత్తం మూడు కలర్స్ ఆప్షన్స్లో తీసుకొస్తున్నారు. ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ఎస్వోసీ ప్రాసెసర్ను అందించనున్నారు.

అలాగే ఈ ఫోన్లో ఫోన్ సోనీ ఐఎంఎక్స్ 882 పోర్ట్రైట్ కెమెరాను ఇవ్వనున్నారు. ఏఐ ఔరా లైట్ వంటి అధునాతన ఫీచర్లను ఇందులో అందించనున్నారు. బ్యాటరీ విసయానికొస్తే ఇందులో 80 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేసే బ్యాటరీని అందించారు.

ఈ ఫోన్లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో కూఇన 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేను ఇవ్వనున్నారు. వర్చువల్ గా 8 జీబీ ర్యామ్ పెంచుకోవడంతోపాటు మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వరకూ స్టోరేజీ కెపాసిటీ విస్తరించొచ్చు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 50 మెగాపిక్సెల్స్, 2 మెగాపిక్సెల్స్తో కూడిన డ్యూయల్ రెయిర్ కెమెరా సెటప్ను అందించారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు.