
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ను తీసుకొస్తోంది. వివో వీ40ఈ పేరుతో ఈ ఫోన్ను లాంచ్ చేయనున్నారు. ఈ నెల 25వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఫీచర్ల విషయానికొస్తే వివో వీ40ఈలో 6.77 ఇంచెస్తో కూడిన డిస్ప్లేను ఇస్తున్నారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్తో ఈ స్క్రీన్ను అందించనున్నారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 5500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు.

తక్కువ బడ్జెట్లోనే ఈ ఫోన్లో ఫుల్ హెచ్డీ+ 3డీ కర్వ్డ్ డిస్ప్లేను అందించనున్నారు. హెచ్డీఆర్ 10+ సపోర్ట్, ఔరా లైట్తోపాటు ఇనిఫినిటి ఐ కెమెరా వంటి అధునాతన ఫీచర్లను ఇందులో అందిస్తున్నట్లు తెలుస్తోంది.

తక్కువ బడ్జెట్లోనే ఈ ఫోన్లో ఫుల్ హెచ్డీ+ 3డీ కర్వ్డ్ డిస్ప్లేను అందించనున్నారు. హెచ్డీఆర్ 10+ సపోర్ట్, ఔరా లైట్తోపాటు ఇనిఫినిటి ఐ కెమెరా వంటి అధునాతన ఫీచర్లను ఇందులో అందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏఐ ఎరేజర్, ఏఐ ఫోటో ఎన్హాన్సర్ వంటి ఫీచర్లకు కెమెరా సెటప్ను ఇందులో అందించారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎస్వోసీ ప్రాసెసర్ తో పని చేస్తుంది. ధరకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకనట చేయలేదు.