
ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోన్లను లాంచ్ చేస్తూ వస్తోన్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం సామ్సంగ్ తాజాగా మరో కొత్త 5జీ ఫోన్ను లాంచ్ చేసింది. గ్యాలక్సీ ఎస్20 ఎఫ్ఈ 2022తో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ను దక్షిణ కొరియాలో విడుదల చేసిన సామ్సంగ్ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తేనుంది.

ఈ స్మార్ట్ ఫోన్లో 120 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+సూపర్ అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించారు. ఇక ఈ ఫోన్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 చిప్సెట్తో పనిచేస్తుంది.

ఇందులో 15 వాట్స్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 4500 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇన్-డిస్ప్లే ఫింగర్ప్రింట్ స్కానర్తో ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకత.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరాను అందించారు. ఇందులో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో పాటు 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఇచ్చారు. ఇక సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా.

రెండు వేరియంట్లలో ఈ ఫోన్ను విడుదల చేశారు. 6జీబీ ర్యామ్+1280 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 43,500 (ఇండియన్ కరెన్సీలో), 8జీబీ+1280జీబీ ఫోన్ ధర రూ. 55,999గా ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు.