
స్మార్ట్ఫోన్ తయారీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సామ్సంగ్ తాజాగా మరో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది.

'గ్యాలక్సీ వైడ్ 5' పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ఫోన్ ప్రస్తుతం సౌత్ కొరియాలో విడుదలైంది. త్వరలోనే మిగతా దేశాల్లోనూ అందుబాటులోకి రానుంది.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఇన్ఫినిటీ-వీ డిస్ ప్లేను అందించారు. అంతేకాకుండా ఈ ఫోన్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్పై పనిచేస్తుంది

కెమెరాకు అధికా ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్లో 64 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరా, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఫోన్లో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కెపాసిటీని అందించారు. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ తో విడుదలైన ఈ ఫోన్ ధర ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.28,200గా ఉంది.