
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్మీ తాజాగా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. ఫిబ్రవరి 14వ తేదీన రెడ్మీ ఏ3 ఫోన్ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ తొలి సేల్ ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్కార్ట్తో పాటు, కంపెనీ అధికారిక వెబ్సైట్లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే బేస్ వేరియంట్ 3జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,299గా ఉండనుంది. అలాగే 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 8,299 కాగా 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9.299గా ఉండనుంది. ఈ ఫోన్ మిడ్నైట్ బ్లాక్, లేక్ బ్లూ, ఆలివ్ గ్రీన్ కలర్స్లలో లభిస్తుంది.

ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 6.71 ఇంచెస్తో కూడిన హెచ్డీ+ డిస్ప్లేను అందించనున్నారు.(1,600x700 పిక్సెల్లు రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ ఈ డిస్ప్లే సొంతం.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్పై పని చేసే ఈ స్మార్ట్ ఫోన్లో డిస్ప్లే చుట్టూ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్ ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ36 ఎస్ఓసీ ప్రాసెసర్తో పని చేస్తుంది.

కెమెరా విషయానికి వస్తే రెడ్మీ ఏ3 స్మార్ట్ ఫోన్లో 8 మెగాపిక్సెల్స్తో కూడిన ఏఐ రెయిర్ కెమెరాను అందించారు.అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. అలాగే ఇందులో 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు.