చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ పోకో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్ను లాంచ్ చేస్తోంది. పోకో ఎస్55 పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్ను ఫ్లిప్కార్ట్లో సేల్కి తీసుకురానున్నారు.
ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.71 ఇంచెస్ హెచ్డీ+ (1650×720 పిక్సెల్స్) డిస్ప్లేను అందించనున్నారని సమాచారం. 20:6:9 యాస్పెక్ట్ రేషియో, 500 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ ఈ స్క్రీన్ సొంతం.
ఇక ఈ ఫోన్లో ఓక్టాకోర్ మీడియాటెక్ హెలియో జీ85 ఎస్వోసీ చిప్సెట్ అండ్ మాలీ-జీ52 జీపీయూను అందించనున్నారు. ఎల్పీడీడీఆర్4ఎక్స్ రామ్, ఈఎంఎంసీ 5.1 ఫ్లాష్ మెమొరీ ఈ ఫోన్ సొంతం.
బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని అందించనున్నారు. ధరకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.
డ్యూయల్ రెయిర్ కెమెరా సెటప్తో వస్తోన్న ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించనున్నారు. ఈ ఫోన్లో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 స్టోరేజ్ కెపాసిటీతో తీసుకొచ్చారు.