చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో తాజాగా మార్కెట్లోకి ఒప్పో ఏ38 పేరుతో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇప్పటికే యూఏఈలో అందుబాటులోకి రాగా తాజాగా భారత్లో లాంచ్ అయ్యింది. సెప్టెంబర్ 13వ తేదీ నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.
ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ ఒప్పో అధికారిక వెబ్సైట్తో పాటు ఫ్లిప్ కార్ట్లో ప్రీ ఆర్డర్లను తీసుకుంటున్నారు. ఇక ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999గా ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1612x720 పిక్సెల్ రిజల్యూషన్తో కూడిన 6.56 ఇంచెస్ హెచ్డీ + డిస్ప్లేను ఇచ్చారు. 90Hz రిఫ్రెష్ రేట్ ఈ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే ప్రత్యేకతగా చెప్పొచ్చు.
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్తో పని చేస్తే ఈ స్మార్ట్ ఫోన్లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ85 ఎస్ఓసీ ప్రాసెసర్ను అందించారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ను ఇచ్చారు.
కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్లో 50 మెగాపిక్సెల్+2మెగాపిక్సెల్తో కూడిన డ్యూయల్ రెయిర్ కెమెరా సెటప్ను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.