
ఈ నెలలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలైన సామ్సంగ్, పోకో, ఐకూ మార్కెట్లోకి కొత్త ఫోన్లను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ వారం మొత్తం 4 కొత్త ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. మరి ఈ ఫోన్ల ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి..

Galaxy A35 5G: సామ్సంగ్ గ్యాలక్సీ ఏ35 5జీ స్మార్ట్ ఫోన్లో 6.6 ఇంచెస్తో కూడిన ఫుల్హెచ్డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించారు. ఇందులో exynos 1480 ప్రాసెసర్ను అందించనున్నారు. ఇందులో కూడా 50 మెగాపిక్సెల్స్ కూడిన రెయిర్ కెమెరాను అందిస్తున్నారు. ధర విషయానికొస్తే రూ. 30,999గా ఉండనుంది.

iQOO Z9 5G: ఐక్యూ నుంచి లాంచ్ అవుతోన్న మరో కొత్త ఫోన్ ఐక్యూ జెడ్9 ఫోన్ ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్లో 6.67 ఇంచెస్తో కూడిన ఫుల్హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించనున్నారు. 120 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఇందులో 50 మెగాపిక్సెల్స్ కూడిన రెయిర్ కెమెరాను అందించారు. ఇందులో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు బేస్ వేరియంట్ ధర రూ. 19,999గా ఉండనుంది.

POCO X6 Neo 5G: త్వరలో మార్కెట్లోకి వస్తున్న మరో కొత్త ఫోన్ పోకో ఎక్స్6 నియో 5జీ. ఈ స్మార్ట్ ఫోన్లో 6.67 ఇంచెస్తో కూడిన అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించనున్నారు. ఇందులో 108 మెగాపిక్సెల్స్తో కూడిన రెయిర్ కెమెరాను, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు.

Samsung Galaxy A55: ఈ స్మార్ట్ ఫోన్లో 6.6 ఇంచెస్తో కూడిన ఫుల్హెచ్డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించారు. 120 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ స్క్రీన్ సొంతం. ఇందులో exynos 1480 ప్రాసెసర్ను అందించారు. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాను అందించనున్నారు. ధర విషయానికొస్తే ప్రారంభ వేరియంట్ రూ. 39,999గా ఉంది.