ఐకూ కంపెనీ భారత మార్కెట్లోకి త్వరలోనే ఐకూ జెడ్7 పేరుతో ఓ 5జీ స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేస్తోంది. వచ్చే నెల మిడిల్లో ఈ ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ను మిడిల్ రేంజ్ బడ్జెట్లో తీసుకురానున్నారు.
ఈ ఫోన్లో ఫీచర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రటన రాలేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న కథనాల ప్రకారం కొన్ని ఫీచర్లు బయటకు వచ్చాయి.
వీటి ఆధారంగా ఈ స్మార్ట్ ఫోన్లో 1,080 x 2,400 పిక్సెల్ల రిజల్యూషన్తో 6.78-అంగుళాల కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించనున్నారు.
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్తో పని చేసే ఈ ఫోన్లో మీడియా టెక్ డైమెన్సిటీ 7200 ఎస్ఓసీ ప్రాసెసర్ను ఇవ్వనున్నారు. 66 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేసే 4600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ అందించనున్నారు.
ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతోపాటు, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. ధర విషయానికొస్తే రూ. 25 నుంచి రూ. 30 వేల మధ్యలో ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు.