
Infinity Train: డీజిల్, బొగ్గు లేకుండా రైలు నడుస్తుంది. ఆస్ట్రేలియాలో ఇలాంటి విభిన్నమైన రైలును నడిపేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ రైలు (Train) పేరు ఇన్ఫినిటీ ట్రైన్. దీనిని ఆస్ట్రేలియా మైనింగ్ కంపెనీ ఫోర్టెస్క్యూ సిద్ధం చేయనుంది. IFL సైన్స్ నివేదిక ప్రకారం.. ఈ రైలు కాలుష్యాన్ని తగ్గిస్తుంది, ఈ విధంగా ఆస్ట్రేలియా సున్నా ఉద్గారాలను లక్ష్యంగా చేసుకుంటుంది.

ఆస్ట్రేలియన్ (Australia) మైనింగ్ కంపెనీ Fortescue ఈ ప్రత్యేక రకం రైలును సిద్ధం చేయడానికి విలియమ్స్ అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ (WAE) కంపెనీని కొనుగోలు చేసింది. ఎనర్జీ రైలును తయారు చేయాలని కంపెనీ కోరుకుంటోంది.

ఈ రైలులో గురుత్వాకర్షణ శక్తి ఇంధనంగా ఉపయోగించబడుతుందని కంపెనీ తెలిపింది. ఈ రైలును ప్రత్యేకంగ రూపొందించనున్నారు. ఈ రైలు పట్టాలపై నడుస్తుండగా దానంతట అదే ఛార్జింగ్ చేసుకునేలా టెక్నాలజీతో రూపొందించనుంది కంపెనీ.

రైలును ఛార్జ్ చేయడానికి భూమి గురుత్వాకర్షణ శక్తి అవసరం. ఈ రైలు సహాయంతో ఇనుప ఖనిజాన్ని తక్కువ ఖర్చుతో ఒక ప్రదేశం నుంచి మరో చోటికి తరలించవచ్చు. 244 కోచ్ల రైలులో 34,404 టన్నుల ఇనుప ఖనిజాన్ని నింపి, దానిని దించిన తర్వాత రైలు ఖాళీగా తిరిగి వచ్చినప్పుడు, దానిని గ్రావిటీ ద్వారా ఛార్జ్ చేయవచ్చు.

పునరుత్పాదక శక్తితో నడిచే వాహనానికి ఈ ప్రత్యేక రకం రైలు గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని ఫోర్టెస్క్యూ సీఈఓ ఎలిజబెత్ గెయిన్స్ చెప్పారు. ఈ విధంగా డీజిల్ వాడకం నిలిపివేయబడటమే కాకుండా కాలుష్య రహిత రైలు ప్రారంభమవుతుంది. భూమి గురుత్వాకర్షణ శక్తితో ఛార్జ్ అయ్యే ఈ రైలు రవాణా రంగంలో పెను మార్పు తీసుకురానుంది.