
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం హువాయు భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్ను లాంచ్ చేసింది. హువాయి వాచ్ జీటీ4 పేరుతో ఈ వాచ్ను తీసుకొచ్చింది. ఈ వాచ్లో అధునాతన ఫీచర్లతో కూడిన ఫీచర్లను తీసుకొచ్చారు.

ఈ స్మార్ట్ వాచ్లో 32 జీబీ ర్యామ్ను అందించడం విశేషం. దీంతో వాచ్ చాలా వేగంగా పనిచేస్తుంది. హువాయి వాచ్ జీటీ 4 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.43 ఇంచెస్తో కూడిన అమోఎల్ఈడీ డిస్ప్లేను ఇచ్చారు. 466 × 466 పిక్సెల్ రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం.

ఈ వాచ్ను స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో రూపొందించారు. ఈ వాచ్లో యాక్సిలరోమీటర్ సెన్సార్, మాగ్నెటోమీటర్ సెన్సార్తో పాటు గైరోస్కోప్ సెన్సార్, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్ వంటి ఫీచర్లను అందించారు. ఇందులో బేరోమీటర్ సెన్సార్, టెంపరేచర్ సెన్సార్ను ఇందులో ఉంచారు.

బ్లూటూత్ కాలింగ్ పీచర్తో తీసుకొచ్చిన ఈ వాచ్లో ఇన్బిల్ట్ స్పీకర్, మైక్రో ఫోన్ను ఇచ్చారు. ఇక ఈ వాచ్లో 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తున్నారు. ఈ వాచ్లో 5 ATM వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ను కూడా అందించారు. దీంతో ఈ వాచ్ 50 మీటర్ల లోతైన నీటిలో కూడా పనిచేస్తుంది.

ఆండ్రాయిడ్ 8.0 వెర్షన్కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఐఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్కు పోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్వాచ్ పొడవు 46 mm, వెడల్పు 46 mm, మందం 10.9 mmగా రూపొందించారు. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ వాచ్ రూ. 14,999గా నిర్ణయించారు. గ్రీన్, బ్లాక్ కలర్స్లో ఈ వాచ్ను తీసుకొచ్చారు.