ప్రముఖ పీసీ తయారీ సంస్థ హెచ్పీ భారత మార్కెట్లోకి కొత్త ల్యాప్టాప్ను తీసుకొచ్చారు. హెచ్పీ ఓమెన్ ట్రాన్స్సెండ్ 14 పేరుతో తీసుకొచ్చిన ఈ ల్యాప్టాప్ను బుధవారం భారత మార్కెట్లోకి తీసుకొచ్చారు.
ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్తో పాటు, హెచ్పీ ఇండియా వెబ్సైట్, హెచ్పీ రిటైల్ స్టోర్స్లో అందుబాటులో ఉన్నాయి. ఫీచర్ల విషయానికొస్తే ఈ ల్యాప్టాప్లో 14 ఇంచెస్తో కూడిన 2.8కే రిజల్యూసన్ ఓఎల్ఈడీ డిస్ప్లేను అందించారు. 120 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం.
కంటిపై ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ పడకుండా ఇందులో తక్కువ బ్లూ లైట్ ప్రొటెక్షన్, ఎడ్జ్-టు-ఎడ్జ్ గ్లాస్తో తీసుకొచ్చారు. ఇందులో 8GB RAM, NVIDIA GeForce RTX 4060 GPUతో కూడిన ఇంటెల్ కోర్ అల్ట్రా 7 155H ప్రాసెసర్ను అందించారు.
స్టోరేజ్ 1 టీబీ వరకు ఉంటుంది. ఇక ఈ ల్యాప్టాప్లో డీటీఎస్ ఎక్స్ అల్ట్రాకు సపోర్ట్ చేసే హైపర్ ఎక్స్ ఆడియో సపోర్ట్ను అందించారు. టైస్సీ యూఎస్బీ పోర్ట్తో తీసుకొచ్చిన ఈ ల్యాప్టాప్లో 140 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 71 డబ్ల్యూహెచ్ బ్యాటరీని అందించారు.
అలాగే ఈ ల్యాప్టాప్లో యూజర్ల కోసం HP ట్రూ విజన్ 1080p పూర్తి-HD IR కెమెరాను అమర్చారు. ధర విషయానికొస్తే షాడో బ్లాక్ కలర్ ధర రూ. 1,74,999కాగా సిరామిక్ వైట్ ధర రూ. 1,75,999గా నిర్ణయించారు.