
పారిస్ కేంద్రంగా పనిచేసే ఎనర్జీజైర్ అనే కంపెనీ కొత్త ఫోన్ను లాంచ్ చేస్తోంది. హార్డ్ కేస్ పీ28కే పేరుతో ఈ ఫోన్ను తీసుకొస్తున్నారు. తాజాగా బార్సిలోనా వేదికగా జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)లో సోమవారం లాంచ్ చేసింది.

బ్యాటరీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ఫోన్లో 28 వేల ఏఎంహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. ఈ ఫోన్ను ఒక్కసారి సింగిల్ ఛార్జింగ్ చేస్తే ఏకంగా 122 గంటల టాక్ టైమ్, 94 రోజులు స్టాండ్ బై బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.

ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్తో కూడిన ఫుల్ హెచ్డీ+ స్క్రీన్ను అందించనున్నారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 60 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 20-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాతోను ఇవ్వనున్నారు.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్లో 4కే క్వాలిటీతో కూడిన వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ గల ఈ ఫోన్ త్రీ ఇయర్స్ వారంటీతో అందించనున్నారు.

ఎనర్జీజైర్ హార్డ్ కేస్ పీ28కే స్మార్ట్ ఫోన్ సేల్స్ వచ్చే అక్టోబర్లో ప్రారంభంకానున్నాయి. ధర విషయానికొస్తే 250 యూరోలుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మన కరెన్సీలో ఈ ఫోన్ ధర రూ. 22వేలుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.