
ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ బ్లౌపంక్ట్ తాజాగా భారత మార్కెట్లోకి సైబర్ సౌండ్ పేరుతో కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. 40 ఇంచెస్, 43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ స్మార్ట్ టీవీలను తీసుకొచ్చింది. మార్చి 12 నుంచి ఈ టీవీలు అందుబాటులోకి రానున్నాయి.

ధర విషయానికొస్తే బ్లౌపంక్ట్ సైబర్సౌండ్ 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ రూ. 15,999కాగా, 43 ఇంచెస్ టీవీ రూ. 19,999గా ఉంది. ఇక ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సందర్భంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై రూ. 1000 డిస్కౌంట్ లభించనుంది.

ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ టీవీలు క్వాడ్కోర్ ప్రాసెసర్తో పనిచేస్తాయి. వీటిలో 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ను అందించారు. రెండు వేరియంట్ టీవీల్లోనూ సరౌండ్ సౌండ్ సపోర్ట్ ఉన్న 40 వాట్ల స్పీకర్లు అందించారు.

ఈ టీవీలు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేస్తాయి. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్తో రిమోట్ ద్వారా వాయిస్ కమాండ్ ఇచ్చే ఆప్షన్ను ఈ టీవీలో ప్రత్యేకంగా అందించారు.

ఇక ఈ టీవీల్లో డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, యాపిల్ ఎయిర్ ప్లే కనెక్టివిటీ ఆప్షన్లతో వస్తున్నాయి. అలాగే మూడు హెచ్డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్బీ పోర్టులు, 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్ ఉన్నాయి.