Telugu News Photo Gallery Teacher Rewards Top SSC Student with Flight Journey for Scoring 550 above Marks
మార్కులు బాగా తెచ్చుకొండి.. విమానం ఎక్కిస్తా.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉపాధ్యాయుడు
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు మల్క రామకిషన్రావు తన మాట నిలబెట్టుకుని విద్యార్థికి విమాన ప్రయాణం కల్పించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పదో తరగతిలో 550కుపైగా మార్కులు సాధిస్తే విమానం ఎక్కిస్తానని హామి ఇచ్చారు.
విద్యార్థులను ఎంకరేజ్ చేయడం కోసం పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధిస్తే విమాన ప్రయాణానికి తీసుకెళ్తా అని ఉపాధ్యాయుడి చెప్పడంతో .. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గణిత ఉపాధ్యాయులు మల్కా రామ్ కిషన్ రావు ఎక్కువ మార్కులు తెచ్చుకున్న విద్యార్థులను విమానం ఎక్కించాడు.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు మల్క రామకిషన్రావు తన మాట నిలబెట్టుకుని విద్యార్థికి విమాన ప్రయాణం కల్పించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పదో తరగతిలో 550కుపైగా మార్కులు సాధిస్తే విమానం ఎక్కిస్తానని హామి ఇచ్చారు.
ఇచ్చిన హామీ మేరకు 554 మార్కులు సాధించిన విద్యార్థి పూర్ణచందర్ ను విశాఖపట్నం తీసుకెళ్లి పర్యాటక ప్రాంతాలు చూపించారు.
గణిత ఉపాధ్యాయుడు మల్కా రామ్ కిషన్ రావు విద్యార్థులకు ప్రోత్సాహం కల్పించేందుకు యేటా ఉత్తమ ఫలితాలు సాదించే విద్యార్థులకు విమానయానం చేయిస్తానని ప్రకటించారు.
గత సంవత్సరంలో ఇద్దరు విద్యార్థులను విమానయానం చేయించారు.బేగంపేట్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన శ్రీమంతుల పూర్ణచందర్ అనే విద్యార్థి పదోతరగతిలో 550మార్కులు సాధించాడు. సొంతఖర్చులు వెచ్చించి అతడిని విమానయానం చేయించారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు విమానంలో తీసుకవెళ్లారు.
విద్యార్థులకు ప్రోత్సాహన్ని అందిస్తున్న ఉపాధ్యాయుడికి గ్రామస్తులు అభినందనలు తెలిపారు.. ప్రతి సంవత్సరం..550 మార్కులు సాధించిన విద్యార్థులకు విమాన ప్రయాణం చేపిస్తానని హామీ ఇచ్చారు.. పిల్లల కు ప్రోత్సహించడానికి.. ఈవిధంగా చేస్తానని అన్నారు.