హైదరాబాద్కు చెందిన 47 ఏళ్ల శ్రీమతి జి. శ్యామల చరిత్ర సృష్టించారు
30 కిలోమీటర్ల మేర శ్రీలంక నుండి భారతదేశానికి జలసంధిలో విజయవంతంగా ఈదారు
సముద్రంలో 30 కి.మీ దూరం ఈత కొట్టిన తొలి తెలుగు మహిళగా రికార్డు క్రియేట్ చేయడమేకాదు..
ప్రపంచంలో రెండవ మహిళగా నిలిచారు శ్యామల
శుక్రవారం తెల్లవారుజామున 4:15 గంటలకు శ్రీలంక తీరం నుంచి ప్రారంభమైన శ్యామల
ఆమె, 13 గంటల 43 నిమిషాల పాటు నిరంతరంగా ఈత కొట్టి రామేశ్వరంలోని ధనుష్కోడికి చేరుకున్నారు
శ్రీమతి శ్యామల ఒక వ్యవస్థాపకురాలు. శ్యామలకు సీనియర్ ఐపిఎస్ అధికారి రాజీవ్ త్రివేది శిక్షణ ఇవ్వడమేకాదు, మార్గనిర్దేశం కూడా చేశారు.
2012 లో 12 గంటల 30 నిమిషాల్లో ఇదే జలసంధిని త్రివేది దాటారు