వాస్తు దోష నివారణ కోసం కొన్ని చర్యలు అత్యంత ఫలవంతం.. ముఖ్యంగా పూజకు కొన్ని వస్తువులు అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ఈ వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వాస్తు శాస్త్రం ప్రకారం పూజ సమయంలో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల ఆనందం, శ్రేయస్సు, సంపదలు లభిస్తాయి. అలాగే లక్ష్మి అనుగ్రహం సదా ఉంటుందని విశ్వాసం.
పూజ సమయంలో గంట: ఇంట్లో పూజ కోసం ఏర్పాటు చేసే గదికి ప్రత్యేక స్థానం ఉంది. పూజ చేసే సమయంలో గంట మ్రోగించడం వలన ఇంట్లో సానుకూలత ఉంటుందని నమ్మకం. కాబట్టి పూజ సమయంలో గంట మోగిస్తారు.
నెమలి ఈక: శ్రీ కృష్ణుడి అలంకరణలో నెమలి ఈకకు మంచి ప్రాముఖ్యత ఉంది. ఇది కన్నయ్యకు మంచి అందాన్ని ఇస్తుంది. అందుకే కొందరు ఇంట్లో నెమలి ఈకలను ఉంచుతారు. నెమలి ఈక సంపదను పెంచుతుంది. ఇంట్లో శాంతి , ఆనందాన్ని కలిగిస్తుందని విశ్వాసం.
శంఖం : పూజ గదిలో శంఖాన్ని ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. అంతేకాదు పూజ అనంతరం.. శంఖాన్నిపూరించడం ద్వారా ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, సంపదలు చేకూరుతాయని నమ్మకం.
కలశం: ప్రతిరోజూ పూజ చేసే సమయంలో నీరు నింపిన కలశాన్ని ఏర్పాటు చేసుకోవడం అత్యంత ఫలవంతం. ఇలా కలశాన్ని ఏర్పాటు చేసుకోవడం దిన చర్యలో భాగంగా చేసుకోండి. కలశం గణేశునికి ప్రీతికరమైనది. కాబట్టి ఈ కలశం ఉంచబడుతుంది.
గంగా జలం: గంగాజలాన్ని ఇత్తడి లేదా వెండి పాత్రలలో ఉంచుతారు. ఇలా చేయడంతో లక్ష్మీదేవి సంతోషిస్తుందని. ఇంట్లో సంపద కూడా పెరుగుతుందని విశ్వాసం.