
ప్రతి ఒక్కరి ఇంటిలో పూజ గది ఉండటం కామన్. రోజూ ఉదయం వేళల్లో సాయంత్రం వేళల్లో పూజ చేస్తుంటారు. అయితే మనం రోజూ పూజ చేసే పూజగదిలో ఎన్ని విగ్రహాలు ఉండాలో తెలుసా? ఇంటిలో పూజ గదిని చాలా పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా ఇంటిలో ప్రతి రోజూ పూజ చేసి, దీపారాధన చేయడం వలన అదృష్టం కలిసి వస్తుందని చెబుతుంటారు. అందువలన పూజ గదిలో ఎప్పుడూ విరిగిన, పాడైన వస్తువులు ఉంచకూడదంట.

పూజస్థలం స్వచ్ఛతకు గుర్తు. ఇది ఎంత అందంగా అలంరించి ఉంటే, ఇంటిలో అంత సానుకూలత ఉంటుంది. పూజ గది గంధరగోళంగా ఉంటే, ఇంటిలోని వారందరూ చాలా గందరగోళానికి గురి అవుతుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, ఇప్పుడు మనం ఇంటిలో పూజ గదిలో ఎన్ని విగ్రహాలు ఉండటం శుభప్రదమో చూద్దాం.

వాస్తు శాస్తరం ప్రకారం, ఇంటి పూజగదిలో ఎక్కువగా దేవతల విగ్రహాలు ఉంచడం మంచిదికాదు. పరిమిత సంఖ్యలో విగ్రహాలు ఉండటం వలన మానసిక ఏకాగ్రత పెరగడమే కాకుండా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అన్ని విధాలుగా కలిసి వస్తుందంట. ముఖ్యంగా పరిమిత సంఖ్యలో దేవతామూర్తుల ఫొటోలు ఇంటిలో సానుకూల శక్తిని పెంచుతాయి.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పూజ గదిలో రెండు నుంచి ఐదు విగ్రహాలు ఉండటం శభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ఇంటిలో సానుకూల శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా, అనేక సమస్యలను నివారిస్తుంది. అంతే కాకుండా వీలైనంత వరకు ఉగ్రరూపంలో ఉన్నవి కాకుండా, శాంత స్వభావంతో ఉన్న విగ్రహాలను మాత్రమే ఇంటి పూజ గదిలో ఉంచుకోవాలి. ఇవి ఇంటి వాతావరణాన్ని చాలా శాంతంగా ఉంచుతాయి.

ముఖ్యంగా, నటరాజ స్వామి, శని, లేదా రాహు కేతువుల ఉగ్ర లేదా ఉగ్ర రూపాలను వర్ణించే విగ్రహాలను , అలాగే కాళీదేవి లేదా కాలభైరవుని ఉగ్ర రూపాన్ని వర్ణించే విగ్రహాలను, ఇంటి గుడిలో ఉంచకూడదు. అటువంటి విగ్రహాలు తీవ్రమైన శక్తికి,తపస్సుకు చిహ్నాలుగా పరిగణించబడతాయి. ఫలితంగా, వాటిని ఇంటి పూజగదిలో ఉంచుకోవడం వలన సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉన్నదంట. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు