
వసంత నవరాత్రుల ప్రత్యేకత.. వసంత నవరాత్రులను చైత్ర నవరాత్రులు అని కూడా అంటారు. శ్రీరామనవమితో ముగియడం వల్ల వీటిని రామ నవరాత్రులు అని కూడా పిలుస్తారు. ఈ తొమ్మిది రోజులు భక్తి, నియమ నిష్టలతో గడపడం ద్వారా ఆధ్యాత్మిక శ్రేయస్సు కలుగుతుందని భావిస్తారు.

రామాయణ పారాయణ ప్రాముఖ్యం.. ఈ సమయంలో లలితా సహస్రనామ పారాయణ, దేవీ పూజలు చేయడం ద్వారా జ్ఞానం, సంపద, బలం పెరుగుతాయని నమ్మకం. ఉత్తర భారతదేశంలో ఉపవాస దీక్షలతో రామాయణ పారాయణం చేసే ఆచారం విస్తృతంగా ఉంది. రామచంద్రుడిని లలితాదేవి స్వరూపంగా భావించే సంప్రదాయం కూడా ఉంది. రామలీలా ఉత్సవాల రూపంలో ఈ పూజలు నిర్వహించబడతాయి. దక్షిణ భారతదేశంలో అయితే శరన్నవరాత్రులలో దేవి ఆరాధనకు అధిక ప్రాధాన్యం ఉంటుంది.

దేవి ఆరాధన విధానం.. నవరాత్రుల మొదటి రోజు కలశ స్థాపన చేసి దీక్ష ప్రారంభించాలి. ప్రతి రోజు ఉపవాసం పాటించి సాయంత్రం దేవి పూజ చేయాలి. లలితా సహస్రనామం, దుర్గా స్తుతి పారాయణ చేయాలి. అమ్మవారికి నైవేద్యం సమర్పించి, ప్రసాదం పంచాలి. ఒక ముత్తైదువును అమ్మవారి స్వరూపంగా భావించి ఆహ్వానించి సత్కరించడం శుభప్రదంగా భావిస్తారు.

శ్రీరామ పూజ విధానం.. వసంత నవరాత్రుల్లో శ్రీరాముని ఆరాధన కూడా విశేషంగా చేస్తారు. రోజూ ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీరామ పూజ చేసి రామాయణ శ్లోకాలు చదవాలి. రామ భజనలు చేయాలి. వడపప్పు, పానకం వంటి నైవేద్యాలు సమర్పించి, ప్రసాదం పంచిన తరువాత ఉపవాసం విరమించాలి.

పాటించాల్సిన నియమాలు.. ఇంట్లో అఖండ దీపం వెలిగించి ఉంచాలి గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టాలి భూశయనం పాటించాలి శక్తికొద్దీ దానధర్మాలు చేయాలి భక్తిశ్రద్ధలతో నియమాలు కచ్చితంగా పాటించాలి ఈ విధంగా వసంత నవరాత్రులను ఆచరిస్తే దేవి అనుగ్రహం, శ్రీరాముని కృప లభించి కొత్త సంవత్సరంలో ఐశ్వర్యం, ఆరోగ్యం, సిరిసంపదలు వృద్ధి చెందుతాయని విశ్వాసం. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)