
మార్చి 26 గురు వారం రోజున కుజ గ్రహం కుంభరాశిలోకి సంచారం చేస్తుంది. ఇది పన్నెండు రాశులపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా దీని వలన మూడు రాశుల వారికి అదృష్టం కలిసి రావడమే కాకుండా, వారు ఎక్కువ బంగారం కొనుగోలు చేసే ఛాన్స్ ఉన్నదంట. కాగా ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూద్దాం.

మేష రాశి : కుజ సంచారం వలన మేషరాశి వారికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. అంతే కాకుండా అన్ని విధాల ప్రయోజనాలు చేకూరనున్నాయి. మేష రాశి వారికి కుజ సంచారం, 11వ ఇంటిలో లాభస్థానంలో జరుగుతుంది. కాట్టి ఈ రాశి వారు అత్యధిక లాభాలు అందుకుంటారు. అంతే కాకుండా వీరి సంపద పెరుగుతుంది. బంగారం కూడా ఎక్కువగా కొనుగోలు చేసే ఛాన్స్ ఉన్నదంట. ముఖ్యంగా ఈ రాశి వారికి గొప్ప కంపెనీలో ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది.

కుంభ రాశి : కుంభ రాశి వారికి కుజ సంచారం మొదటి ఇంటిలో జరుగుతుంది. దీని వలన వీరికి అన్ని విధాలా కలిసి వస్తుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి బంగారం కొనుగోలు చేయాలని, లేదా స్థిరాస్తి కొనుగోలు చేయాలి అని భావిస్తున్నారో, వారికి కలిసి వచ్చే రోజుగా చెప్పాలి.

మకర రాశి : మకర రాశి వారికి కుజ సంచారం చాలా లాభాలను తీసుకొస్తుంది. వీరి ఇంట పసిడి పంటపండిస్తుంది. ఈ రాశి వారు ఎవరు అయితే చాలా రోజుల నుంచి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, వారి సమస్యలన్నీ తీరిపోతాయి. చాలా ఆనందంగా ఉంటారు. చేపట్టిన పనులు అన్నీ విజయవంతం అవుతాయి. సంపద పెరుగుతుంది.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు