
ఖజురహో దేవాలయాలు: మధ్యప్రదేశ్లోని ఖజురహో దేవాలయాలు అందాలకు ప్రసిద్ధి. ఈ దేవాలయాలు 900 AD నుండి 1130 AD మధ్య నిర్మించబడ్డాయి. ఖజురహో ఆలయాన్ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు వస్తుంటారు.

తీర దేవాలయం: తమిళనాడులోని షోర్ టెంపుల్ కాంప్లెక్స్లో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ నుండి బంగాళాఖాతాన్ని చూడవచ్చు. ఇక్కడ దేవాలయాలు 8వ శతాబ్దంలో నిర్మించబడ్డాయని చారిత్రక కథనం.

మీనాక్షి అమ్మవారి ఆలయం: తమిళనాడులోని ఈ ఆలయం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయం మధురైలో ఉంది. పంచ శక్తి పీఠాల్లో మధుర మీనాక్షి ఆలయ పీఠం ముఖ్యమైంది. ఈ ఆలయాన్ని చూడగానే అందం కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్లేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు.

కేదార్నాథ్: కేదార్నాథ్ను సందర్శించడానికి భారతదేశం నుండే కాకుండా విదేశాల నుండి కూడా ప్రజలు వస్తుంటారు. శివుని 12 జ్యోతిర్లింగాల క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇక్కడ మంచుతో కప్పబడిన హిమాలయాలు.. మంచు దుప్పటి కప్పుకున్న అందమైన పర్వతాలను చూడటం ఒక భిన్నమైన అనుభూతిని ఇస్తుంది.

శ్రీరంగం ఆలయం: తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని శ్రీరంగంలో ఉన్న శ్రీరంగం ఆలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. విష్ణువుకి చెందిన ప్రముఖ ఆలయం. ఈ ఆలయం విజయనగర కాలంలో (1336–1565) నిర్మించబడింది.