
సెప్టెంబర్ 7న బుధుడు కన్యారాశిలోకి సంచారం చేస్తాడు, ఆ తర్వాత మరోసారి సెప్టెంబర్ 26న తుల రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వలన మూడు రాశులు కుంభ రాశి , సింహ రాశి ,వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుందంట.

కుంభ రాశి : కుంభ రాశి వారికి బుధ గ్రహం ద్వంద్వ సంచారం వలన చాలా అద్భుతంగా ఉంటుంది. పట్టింది బంగారమే , ముట్టింది ముత్యమే అవుతుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. సమాజంలో ఈ రాశి వారికి ప్రత్యేక ప్రాముఖ్యత నెలకుంటుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

సింహ రాశి : సింహ రాశి వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. బుధుడు వీరిపై వరాల జల్లు కురిపిస్తాడు. దీని వలన ఈ రాశి వారు సెప్టెంబర్ నెల మొత్తం చాలా ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ఎందుకంటే వీరు ఏది ముట్టినా అది బంగారమే అవుతుంది.

వృషభ రాశి : వృషభ రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు నెలకొంటాయి. చాలా రోజుల నుంచి ఎవరు అయితే మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది మంచి సమయం. పెద్ద కంపెనీలో జాబ్ సంపాదించుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా ఈ రాశి వారు ఈ సమయంలో వ్యాపారం ప్రారంభిస్తే అది చాలా గొప్పగా లాభాలను తీసుకొస్తుంది.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు