
ఇక ఈ మంగళగౌరీ వ్రతం ఆచరించడం వలన అఖండ సౌభాగ్యం కలగడమే కాకుండా అన్నివిధాలుగా కలిసి వస్తుందని చెప్పుకొస్తుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో వివాహిత స్త్రీలు మంగళగౌరీ వ్రతం ఆచరించి, ఉపావాస దీక్షలతో అమ్మవార్లను పూజిస్తూ అష్టోత్తరాలు చదవడం వలన సకల శుభాలు కలుగుతాయని చెప్పుకొస్తుంటారు. అయితే ఇంతటి పవిత్రమై రోజున కొన్ని పనులు అస్సలే చేయకూడదంట. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం.

శ్రావణ మంగళవారం రోజున అస్సలే మాంసం, మధ్యం తీసుకోకూడదు. ముఖ్యంగా గుడ్లు, చేపలు, చికెన్, మటన్ లాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. సాత్విక ఆహారాలు మాత్రమే తీసుకోవాలి. ఈరోజు నాన్ వెజ్ తీసుకోవడం వలన అనేక సమస్యలు ఎదురు అవుతాయంట.

అలాగే మంగళ గౌరీ వ్రతం ఆచరించే వారు, ఉపావాసం ఉంటే, ఆ సమయంలో ఉల్లి, వెల్లుల్లి తమ ఆహారంలో లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు పండితులు. అంతే కాకుండా ఈ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో వంకాయ, ఆకుకూరలు కూడా తినకూడదంట.

అదే విధంగా ఈరోజు స్త్రీలు , పురుషులు గోర్లు కట్ చేయడం, జుట్టు కత్తిరించుకోవడం , ఇతరులను అవమానించడం, తప్పుడు పదజాలం ఉపయోగించడం లాంటివి అస్సలే చేయకూడదు అని చెబుతున్నారు పండితులు. దీని వలన అనేక విధాలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. ముఖ్యంగా అనారోగ్య, ఆర్థిక సమస్యలు ఎదురు అవుతాయంట.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు