
వృషభరాశి : వృషభ రాశి వారికి శుక్రుడు ఉన్నత స్థానంలో ఉండటం వలన అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఆకస్మిక ప్రయాణాలు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకొన వారికి ఇది మంచి సమయం. కుటుంబంలో ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది.

మిథున రాశి : ఈ రాశి వారిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. కష్టానికి తగిన ఫలితం వస్తుంది. చాలా రోజుల నుంచి గుర్తింపు లేదని బాధ పడే వారికి ఈ సమయంలో మంచి గుర్తింపు రావడమే కాకుండా, అవార్డులు అందుకునే ఛాన్స్ కూడా ఉంది. అలాగే ఆదాయం పెరుగుతుంది. సామాజిక హోదా విపరీతంగా పెరుగుతుంది.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారు మాలవ్య రాజయోగం వలన అద్భుతమైన ప్రయోజనాలు అందుకుంటారు. ఊహించని విధంగా ఈ సమయంలో వీరి జీవితం మలుపు తిరుగుతుంది. ఇల్లు కొనుగోలు చేయాలి అనుకునే వారి కోరిక నెరవేరుతుంది. కార్యాలయాల్లో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి మాలవ్య రాజయోగం వలన సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకోని విధంగా ఆదాయం చేతికందుతుంది. గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి. ఉద్యోగం చేసే చోట ప్రశంసలు అందుకుంటారు. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. సీనియర్స్ నుంచి సహాయ సహకారాలు అందుతాయి.

ఆరోగ్యం బాగుంటుంది. ధన లాభం కలుగుతుంది. కొందరికి ఈ రాజయోగం వలన ప్రమోషన్స్ కూడ వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్థికం కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.